Type Here to Get Search Results !

VROలకు DDO అధికారాలు ఇస్తూ ఇచ్చిన జీవో నెం.2 ఉపసంహరించుకున్న ప్రభుత్వం

గ్రామ సచివాలయాలలో VROలకు DDO అధికారాలు ఇస్తూ ఇచ్చిన జీవో నెం.2 ఉపసంహరించుకున్న ప్రభుత్వం

AP ప్రభుత్వం జీవో నెం.2ను ఉపసంహరించుకుంది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల అధికారాలను VROలకు ఇస్తూ ఈ జీవో తెచ్చింది. అయితే ఈ జీవోను గత విచారణలో హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం కోరగా ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది.
జీవోను సవరించుకునే లోపే కొందరు కోర్టుకు వెళ్లారని మంత్రి వ్యాఖ్యానించగా.. అందుకు భిన్నంగా ప్రభుత్వం వెకేట్ పిటిషన్ వేయడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది
జీవో నం.2ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ మేరకు విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.